28వ అధ్యాయము
అంబరీషకృత సుదర్శన స్తుతి

అంబరీషుడు ఇట్లు పలికెను. ఓ సుదర్శనచక్రమా ! ఆగు ఆగు. నీకు నమ స్కారము. ఈతడు బ్రాహ్మణుడు. ఇతనిని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నాశరీరమును యిచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేనియెడల నాతో యుద్ధము చేయుము.
నీవు హరియొక్క ఆయుధముగనుక నాకు దైవమునైతివి. అయినప్పటికి నీతో యుద్ధము చేయుదునుగాని నిన్ను బ్రతిమాలుట లేదు. క్షత్రియునకు బ్రహ్మ యుద్ధ మును విధించెనుగాని యాచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శనచక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈ మాట నాకు తెలియునుగాని అయినను నా బాహుబలమును జూడుము.
విష్పాది దేవతలందరు నీ బలమును నా బలమును చూతురుగాక, నిన్నిప్పుడు భూమియందు పడవైచెదను. అట్టి యవస్థను జెందక యీతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము. శరణాగతుడైన యీ బ్రాహ్మణుని విడువుము. రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవల యునను తలంపుతో కోపము వచ్చినవాడువలె నటించి యిట్లనియె.
సుదర్శనమిట్లు పల్కినది. రాజా! నీకు తెలియునా? మధుకైటభులను నేను చంపి తిని దేవతలకు జయించుటకు శక్యముకానివారైన రాక్షసులను అనేకులను చంపితి నని తెలియదా? ఈ దుర్వానసుని కోపముతో గూడిన ముఖమును జూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా? ఇట్టి దుర్వాససుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను యిప్పుడిట్టి అవస్థను నావలన జెందెను గదా ?
శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించి నది ఆ బ్రహ్మతేజస్సు నాకంటే అధికముగాదు. అదియు నాచేత అనేక పర్యాయములతిక్రమించ బడినది. క్షత్రియతేజోవంతుడవైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్ధుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తేజస్సులు నాకు చాలని వైయున్నవి.
రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందు నైతివి. నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరముగా పొమ్ము, ప్రాణములను వృధాగా పోగొట్టు కొనకుము. ఇట్లు సుదర్శన చక్రవాక్యమును విని అంబరీషుడు కళ్ళెఱజేసి సుదర్శనచక్రముతో ఇట్లనెను.
అంబరీషుడు ఇట్లు చెప్పెను. సుదర్వనచక్రమా! నీవు నాదేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూఱుఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు. గనుక యిక ముందు నీకు గర్వముండబోదు. నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీల యందును, జ్ఞాతులందును, గోవులందును, బాణములను వదలను. నీవు క్రూరుడ వైనను దేవుడవగుట చేత ఇంతరకు ఉపేక్షించితిని.
నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతోగూడి నాయందు నిలచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము చూతము. ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్రపాదముల మీద వదలెను. ఇట్లు క్షాత్రపౌరుషముతో గూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు ఇట్లనియె. ,
సుదర్శనుడు ఇట్లు పలికెను. రాజా ! నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రామ్మణుని విడిచితిని. సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగిలించుకుని భూమియందుపడి నమస్కారము చేసెను.
ఓ అగస్త్యా ! రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రర్ణ పురుషునితో చక్రముతో ఇట్లనియె. సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనె క్కడ? హరియొక్క హస్తమందు
ప్రకాశించెడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడనయిన నా తప్పును క్షమించుము.
నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమయిన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము. ఇది శుక్లపక్షము. పగలు, యుద్ధభూమి, మకరమాసము, మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతినిగోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లుకలదు.
ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతినొందినవారు అర్చిరాది మార్గమునపోయి బ్రహ్మపదమును జేరుదురు. కార్తీక శుక్ల ద్వాదశినాడు వెళ్లిన దుర్వాసనడు మాఘమాసమునకు తిరిగివచ్చెను. సుమారు 3 మాసాలకు అంబరీషుని చేరినాడు.
జ్వాలలచేత భయంకరమును, దేవదానవుల కసహ్యమును, నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియునయిన నీరూపమునుగవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబమువలె సహస్రారములను ధరించునటు వంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధముచేయ నేనెట్లు శక్తుడ నగుదును?
కోరలతో గూడిభయంకరము దశదిక్కులందు అగ్నులను బయటికి చిమ్ముచున్నటు వంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడుగాని, రాక్షసాధిపతి గాని యింకెవ్వడుగాని సహించగలడు?
మెరుపులను సూర్యుని కిరణజాలములును మొత్తములై భయంకరా కారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకారాకరమయిన నిన్నా శ్రయించి మూడులోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలుగాని, దానవులుగాని, అన్యులు గాని నిన్ను జయించలేరు.
దైత్యులను చంపుదానవు భక్తులను పరిపాలించునావు. విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమనకష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము.
ఇట్లు స్తుతించి భూమియందు నమస్కారముచేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక అని సుదర్శనుడుపలికెను. ఈ సుదర్శనచక్ర స్తోత్రమును మూడు కాలము లందు పఠించువాడు ఆపదలనుండి విముక్తుడై చిరతరసుఖములను బొందును. కలియుగ మందీ యధ్యాయమును ఒకమారయునను వినువారు అనేక భోగములు పొంది అంత మందు మోక్షము పొందుదురు.