27వ అధ్యాయము
దుర్వాససుడు అంబరీషునిగూర్చి ప్రత్యాగమనము

ఓ అగస్త్యమునీంద్రా ! భగవంతుడు ఐన పురుషోత్తముడిట్లు దుర్వాససునితో పలికి స్వభక్తపాలన దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్ల నియె.
భగవంతుడిట్లు పల్కెను. దుర్వాససా ! అంబరీషుని గురించి యిచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును జేయుచున్నవి. ఈ శాపజన్మలవల్ల నాకేమీ కష్టములేదు. నీవచనము వేదతుల్యముగనుక దానిని సత్యముగా చేయవలెను. అట్లుగాని యెడల
బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాప మగును గాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. రాజు ప్రాయోపవిష్ణుడువలె
బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మనాపకారి యీ ఆత్మ యని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము. “
రాజు యీ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. ఛీ! ఛీ ! బ్రాహ్మణోపద్రపకారకుడయిన రాజు ఎందుకు?
రాజు మనుష్యులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును, బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణ ములు విడువవలెను.
రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ్ఞ, జరాయుజములను నాలుగు విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికి దండన మీయదగును పాలించవలెను బ్రాహ్మణులను విడువ వలెను. బ్రాహ్మణుని సత్యధర్మరతులును, లోభదంభ శూన్యులును అగు బ్రాహ్మణులే ఆతని తప్పును దెలిసికొని దండించవలెను.
బ్రాహ్మణుడు పాపమును జేసి ప్రాయశ్చిత్తమును జేసికొననిపక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్తానభ్రష్టత్వము మొదలయిన దందనములచేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింసచేయుచున్నను వానిని రాజు దండించ రాదు. రాజు ధర్మార్థబుద్ధి గలవాడగుచు యెప్పుడైనను బ్రాహ్మనునకుగాని తనకపకారము చేయువానికి గాని శస్త్ర ప్రయోగము ఆచరించదగును.
బ్రాహ్మణేతరులందరు భయములేక క్షాత్ర కీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హింసమాత్రము చేయగూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యునిచేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది. బ్రాహ్మణుడు లాగబడిగాని, కొట్టబడిగాని, ధనహీనుడుగా చేయబడిగాని యెవనినుద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మ హంతకు దగును. దుర్వాసనునకు ప్రాణహానికరమైన కష్టము నామూలముగా గలి గెనుగదా? కాబట్టి నేను బ్రాహ్మణహంతకుడనైతిని అని అతడు తలచుచున్నాడు. దుర్వాసా! అంబరీషుడీ ప్రసంగములో మిక్కిలిదుఃఖముతో నున్నాడు. కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువుచెప్పిన మాటను విని దుర్వాస సుడు నమస్కరించి అప్పుడే చక్రముతోసహా బ్రాహ్మణపరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను.
ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాససునిజూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో యిట్లని విన్నవించెను. అంబరీషుడు పల్కెను. ఓచక్రమా ! నన్ను మన్నించుము. ఆరుని సంహరించుట న్యాయముగాదు గనుక
బ్రాహ్మణుని రక్షించుము. అతిక్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము.
అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాససుని కౌగలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శనచక్రముతో ఇట్లనియెను.