30వ అధ్యాయము
ధర్మసూక్ష్మ కథనము

ఋషులడిగిరి. ఓ సూతమహర్షీ ! మాకు పుణ్యమైన హరి మాహాత్మ్యమును జెప్పితివి. ఇంకా కార్తికమాహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది.
కలియుగమందు కలుషితమానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించెడిదియేది ?
ధర్మములలో యెక్కువ ధర్మమేది? దేనివలన మోక్షము సిద్ధించును? దేవతలలోపల యెక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు జడులు, మృత్యుపీడితులును అగుదురు. వారికి అనాయాసముగా మోక్షముదొరికెడి ఉపాయమును జెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను జెప్పుము.
సూతుడు పల్కెను. మునీశ్వరులారా ! మీరడిగిన ప్రశ్న చాలా బాగు న్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది. కాబట్టి సర్వసుఖకర మైన దానిని చెప్పెదను వినుడు.
మీరు అల్పబుద్ధులయిన జనులకు మోక్షపాయమును జెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలోకోపకారము కొరకయినదుటచేతనాకు చాలా ఆనంద దాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్యతీర్ధములందు స్నానాదికమాచరించియు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఈలాటి మంచిమాటలచేత లభ్యమగును.
మునీశ్వరులారా ! వినుడు. కార్తికఫలము వేదోక్తమైనది. అనగా కార్తికమందు వేదోక్తఫలమును బొందెదరని భావము. కార్తిక వ్రతము హరికి ఆనందకారణము, సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్ధుడనుగాను, కాలము చాలదు, కాబట్టి శాస్త్రసారములలోసారమును జెప్పెదను వినుడు.
శ్రీహరికథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరికాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రమునుండి తరింతురు.
కార్తికమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయము లందు రాత్రి దీపమును వెలిగించుటను జేయువారు అనేక పాపములనుండి శీఘ్రముగా ముక్తు లగుదురు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తిక వ్రతమును జేయవలెను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును. సుమా.
బ్రాహ్మణులుగాని, క్షత్రియులుగాని, వైశ్యులుగాని, శూద్రులుగాని, స్త్రీలుగాని కార్తికవ్రతమును జేయని యెడల తమ పూర్వులతో కూడా అంథతామిస్రమను పేరుగల నరకమును, (చీకట్లతో గ్రుడ్డిదగు నరకము) బొందుదురు. సంశయములేదు. ఈ
కార్తికమాసమున కావేరి జలమందు స్నానమాచరించువారు దేవతలచేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు. కార్తికమాసమందు స్నానముచేసి హరిని పూజించు మానవుడు విగతపాపుడై వైకుంఠమును జేరును.
మునీశ్వరులారా ! కార్తీకవ్రతమును జేయనివారు వేయి జన్మము లందు చండాలురై పుట్టుదురు. కార్తికమాసము పుణ్యకరము. సమస్త మాసములందు శ్రేష్ఠము. కార్తికవ్రతము హరిప్రీతిదాయకము. సమస్త పాపహరము. దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవియుండగా కార్తికమాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరి సేవను జేయువారు సమస్త దుఃఖవిముక్తులై మోక్షమొందెదరు.
కార్తికమాసమందు దీపదానము, కంచుపాత్రదానము, దీపారా ధనము, ధాన్యము, ఫలము, ధనము,గృహదానము అనంతఫలప్రదములు.
ధనికుడుగాని, దరిద్రుడుగాని హరిప్రీతి కొరకు కార్తికమాసమందు కధను విన్న యెడల వినిపింపచేసిన యెడల అనంతఫలమునొందును. కార్తిక మాహాత్మ్యము సర్వపాప ములను నశింపజేయును. సమస్త సంపత్తులను గలుగజేయును. అన్ని పుణ్యములకంటేను అధికము. ఎవడు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్పసుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి ఒక జననమరణ ప్రవాహమున పడకుండ జేయునదియే పరసుఖము లేక నిత్యసుఖము.                                                    :సమాప్తం :