22వ అధ్యాయము
పురంజయ విజయము

అత్రిమహాముని ఇట్లుపల్కెను. ఇట్లు సుశీలుని మాట విని పురం జయుడు విష్ణ్వాలయమునకుబోయి పుష్పములచేతను, ఫలములచేతను, చిగురుటాకులచేతను, దళములచేతను, షోడశోపచారపూజల చేతనుహరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమునుజేసి హరిమూర్తిని బంగా రముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను.
పురంజయుడు కార్తిక పూర్ణిమనాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణజేయుచు ప్రాతఃకాలమందు నిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కిధనుర్బాణములను, కత్తిని; తూణీరములను ధరించి కంఠమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చినారీటంకారధ్వనిని చేసెను. ఆ ధ్వనివిని రాజులందరు యుద్దమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు జేయుచు బాణ వర్షములను కురిపిం చుచు పూర్వమువలె జయింతమను తలంపుతో పురంజయుని పైకి దుమికిరి.
పిమ్మట పరస్పరము పిడుగులవంటి బాణములతోను, వజ్రములవంటి కత్తుల తోను, ఐరావతమువంటి ఏనుగులతోను, ఆకాశమునకు ఎగురు గుఱ్ఱములతోను, త్వరగా నడిచెడి రథములతోను, అన్యోన్యజయ కాంక్షతో భయంకరమయిన సంకుల యుద్ధముచేసిరి. ఆ యుద్దమందు రాజులందరు మదములుడిగి గుఱ్ఱములు హతములై ఏనుగులు ధరణిగూలి, బాణశరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై రథ, గజ, సాది, పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించుడు, రక్షించుడు అని ప్రార్థించుచుండిరి.
కాంభోజరాజు తన సైన్యమంతయు హతమగుట జూచి పురంజయు నకిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తనపురమును జేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమొందెను. హరి అనుకూలముగా ఉండిన యెడల శత్రువు మిత్ర మగును. అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూల ముగా ఉన్న మిత్రుడే శత్రువగును. ధర్మమే అధర్మమగును. కార్తిక వ్రతమును జేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును సమస్త ప్రాణులకు రక్షకుడును అగుహరిని సేవించిన యెడల సమస్త దుఃఖములు తొలగిపోవును.
విష్ణుభక్తుడు తేజోవంతుడు ఇది సత్యము. అందును కార్తికవ్రత మందు కోరిక యుండుట మరీ దుర్లభము గదా. కలియుగమందు హరి భక్తులై కార్తిక వ్రతపరాయణులైన వారు శుద్దవైష్ణవులని తెలిసికొనవలెను. కార్తికవ్రతమును జేయుచు హరిభక్తి గలిగిన శూద్రులు కూడా వైష్ణోవోత్తములనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తిలేని వారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి గలిగి కార్తికవ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వానియందు హరినివసించును.
ఏ జాతివాడుగాని దుస్తర సంసారతరణేచ్చ గలిగెనేని హరిభక్తి చేయ వలెను. అట్లయినచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును. అగస్త్య మునీంద్రా ! హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును. పరాశరాదులు వశిష్ఠాదులు అంబరీషాదులు నగరా దులు హరినాశ్రయించి పరమపద మొందిరి. హరిభక్తి యందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు గావలయును.
హరిభక్తి ప్రియుడును, భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును, సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండియున్నాడు. అట్టి హరియందు భక్తిగలవానికి కార్తికవ్రతము సులభమని తలచెదను.
కార్తికవ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావిచెట్టుతో సమానమైన చెట్టునులేవు. ఓ విదే! కాబట్టి కార్తికవ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వవతోత్తవె త్తమము. ఇది సర్వశాస్త్రసారము. సర్వవేద సమ్మతము. కార్తికమాహాత్మ్య బోధకమైన యీ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరినిజేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధ కాలమందు పఠించిన యెడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి గలుగును. “