12వ అధ్యాయము
కార్తికద్వాదశీమాహాత్మ్యము ధర్మవీరోపాఖ్యానము

సాలగ్రామ దాన మహిమ వశిష్ట మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా ! కార్తికమాసమందు సోమవార మహాత్యమును వినుము. సోమవారముకంటే శనిత్రయోదశి నూరురెట్లు ఫలము గలది. శనిత్రయోదశికంటె కార్తిక పూర్ణిమ వెయ్యిరెట్లు ఫలముగలది. పూర్ణిమకంటె శుద్ధపాడ్యమి లక్షరెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమికంటే చివర ఏకాదశికోటి గుణఫల ప్రదము. అంతిమైకాదశికంటే కార్తిక ద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశి యనగా కార్తిక బహుళైకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన యెడల కార్తికశుద్ధేకాదశియేయగును. వింధ్యోత్తరదేశ మందు అంతిమైకాదశి యనగా కార్తికశుద్ధేకాదశిని గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తికశుద్ధేకాదశిని గురిం చియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుదైకాదశియే గ్రహించబడినది.
మోహముచేతనైనా అంతిమైకాదశినాడు ఉపవాసముచేసి గీతవాద్య పురాణముల చేత జాగరణ మాచరించువాడు సమస్త పాపవిముక్తుడై విష్ణు లోకమందు నివసించును.
కార్తికమాసమందు ఏకాదశినాడు ఉపవాసమాచరించి ద్వాదశినాడు బ్రాహ్మణు లతో గూడా పారణచేయువాడు సాయుజ్యముక్తి పొందును. కార్తిక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము జేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిబొందును.
సూర్యగ్రహణమందుగంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజ నము పెట్టిన పుణ్యము ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. వేయి గ్రహణము లును, పదివేల వ్యతీపాత యోగములును, లక్ష అమావాస్యలును కలిపి ద్వాదశీ వ్రతఫలానికి పదహారవంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరి ప్రియముగాన వాటికన్నిటికంటే అధికఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిదేవతగా కలది.
కార్తికశుద్ధ ద్వాదశినాడు అనగా ఏకాదశినాడు రాత్రి యామముం డగా హరిపాల సముద్రము నుండి నిద్రలేచునుగాన ఆ ద్వాదశి హరిబోధిని యనబడును. ఆ ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకయినను అన్నదాన మాచ రించువాడు యిచ్చట భోగములను బొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తికమాసమందు ద్వాదశినాడు పెరుగు అన్నమును దానము చేసిన యెడల సమస్త ధర్మములకంటే అధిక ఫలమును బొందును.
స్త్రీగాని, పరుషుడుగాని కార్తికశుక్ల ద్వాదశినాడు పాలిచ్చెడి యావు నకు బంగారపు కొమ్ములు వెండిడెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో గూడ గోదానమాచరించిన యెడల ఆ గోవుకు యెన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల యేండ్లు స్వర్గనివాసము కలుగును.
కార్తికమాసమందు ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసికొని వైకుంఠలోకమును బోవును. ఇందుకు సందేహములేదు. కార్తికమాసమందు ద్వాదశియందుగాని, పూర్ణిమయందుగాని, పాడ్యమియందుగాని కంచు పాత్రలో ఆవునెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానిమిచ్చువానికి కోటి జన్మములలో చేయ బడిన పాపములు నశించును. –
కార్తిక ద్వాదశినాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూల మును, దక్షిణను యిచ్చువాడు యీలోకమందు అనేక భోగములను బొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో గూడా చిరకాలము సుఖించును.
” కార్తిక ద్వాదశినాడు బంగారపు తులసీవృక్షమును, సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తిక ద్వాదశినాడు పూర్వోక్తదాన మును జేసినవాడు నాలుగు సముద్రలము మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలమును బొందును.
ఈ విషయమందు ఒకకథ గలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతక ములు నశించును. గోదావరీ తీరమందు దురాచారవంతుడైన యొక కోమటిగలడు. అతడు స్వల్పదానమైననుచేయుట ఎఱుగడు. తానైనను అనుభవించుటయునులేదు. వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనిందచేయువాడు, పరద్రవ్యము లందాసక్తి గలిగియుండు వాడు. ఆ కోమటియొక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ ఋణ మును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతర మందున్నట్లు తెలిసికొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా! నా సొమ్ము నాకిమ్ము అని యడిగెను.
బ్రాహ్మణుడా మాటవిని ఓయీ ! యీనెలాఖరుకు నీ సొమ్మును నీకు యేదోయొక విధముగా యిచ్చెదను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసికొని పొమ్మనెను.
ఋణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలనొంది తిరిగి ఋణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును యివ్వవలసియుండును.
బ్రాహ్మణుడిట్లు చెప్పినమాటను విని వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూధా! బ్రాహ్మణాధమా ! నాధనము నాకిప్పుడేయిమ్ము. లేనియెడల యీకత్తితో నిన్ను నఱుకుదు నని దుర్మార్గబుద్ధితో ఆవేదాంతవేత్త యైన బ్రాహ్మణుని జుట్టుపట్టుకుని లాగిక్రిందపడద్రోసి పాపబుద్దిగల వాడగుటచేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బచేత లేడివలె మృతినొందెను. –
తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చటనుండి పరిగెత్తి యింటికిపోయి బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినొందెను. అంత కరాళముఖులును, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును, భయంకరులునునగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశ ములచేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞచొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగవిశేషము దాని సంబంధమైనది రౌరవము. అనగా రురుమృగములచేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరకము రౌరవనరక మనబడును.
ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రిపోయిన తరువాత తండ్రి సంపాదిం చిన ధనముచేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్నచిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజములను జేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి ఆకలి గలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను జేయుచుండెను.
ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని బూజించుసమయమున నాదర మహాముని సమస్తలోకములందు తిఱుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణో, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స భూషవిశ్వంభర, సమస్తదేవతాచక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను.
ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుజూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రములవెంట ఆనందబాష్పములను వదలుచుముని పాదములకు నమస్కరించి దండప్రణామమాచరించెను. నారదుడు తనపాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకొనెను.
తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరునిముందఱ అంజలినిబట్టిన వాడై అర్యాదులచేత పూజించి హేనారదా మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము.
నేను పూర్వమందు యేమిపుణ్యము చేసితినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్రా! మీకుదాసుడను. ఏమిసేవచేయవలెనో చెప్పుము చేసెదను.
వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియె. నారదుడిట్లు పల్కెను. ధర్మవీరా ! నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తిక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆరోజున చేసిన స్నానదానాదికము అనంతఫల ప్రదమగును.
సూర్యుడు తులారాశియందుండగా కార్తికమాసమందు ద్వాదశినాడు ధనికుడు గాని, దరిద్రుడుగాని, యతిగాని, వానప్రస్థుడుగాని, బ్రాహ్మణుడుగాని,
క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, స్త్రీగాని సాలగ్రామ దానమాచరించువారికి జన్మజన్మాంతర కృత పాపములు నశించును.
ధర్మవీరా ! వినుము. నీతండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధల నొందు చున్నాడు. అతని పాపవిశుద్ధి కొరకు కార్తిక ద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదాన మును జేయుము.
నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియె. మునీంద్రా! గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలయిన మహాదానములచేత కాని ముక్తి శిలాదానముచేత యెట్లు గలుగును?
శిలాదానమువృధాగా చేయుట యెందుకు? అది భోజ్యముగాదు. భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచునివలె దానముచేయను. నారద మహర్షి ఎంతగా నొక్కిచెప్పినను వైశ్యుడు మూడుడై సాలగ్రామ దానమును జేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్థానమాయెను. ఆ
తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతినొంది మహాత్నుల మాటవినని దోషముచేతను, సాలగ్రామ దానము చేయని దోషముచేతను నరకమందు బాధలనొంది తరువాత మూడుసారులు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంత రము అయిదుమారులు వృషభమై యుండి తరువాత పదిమారులు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును బొందియుండెను.
ఇట్లు పదిజన్మలు గడచిన తరువాత పదకొండవ జన్నమందు యాచకుని కుమా ర్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనము రాగానే తండ్రి తగిన వరున కిచ్చి వివాహముచేసెను. కానీ పూర్వకర్మవలన ఆ వరుడపుడే మృతుడయ్యెను. దానిని, మృతినొందిన ఆ అల్లుని బంధువులందరు వచ్చి చూచి అట్టి బాల్యవైధవ్యమునకు కారణమును దెలిసికొని బంధువులందరికిని కుమార్తె యొక్క పూర్వపుణ్యమును, పూర్వపాప మును జెప్పెను.
ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంత రార్జిత పాప నాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తికసోమవారమందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానముచేసెను.
ఆ సాలగ్రామశిలా దానమహిమచేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరు సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకుబోయి అందు బహుకాల మానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యెను.
ప్రతి సంవత్సరమందు కార్తిక సోమవారమున సాలగ్రామ శిలాదాన మాచరించి ఆ పుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమచేత ముక్తుడాయెన. కాబట్టి జనకరాజా ! కార్తికమందు సాలగ్రామ దానముచేత హరి సంతోషించును. ఇందుకు సందియములేదు.
పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తిక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశీసాలగ్రామ దానాదులచేత పోగొట్టుకొన గల్గుదురు. కార్తకమాసమందు సాలగ్రామ దానమువలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తములేదు. ఇందుకు సందియములేదు.